సచివాలయం ప్రతినిధి: ఉద్యోగుల కోసం డిస్కమ్లు పాత సర్వీస్ రూల్స్నే కొనసాగించాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీతో మంత్రి బాలినేని, సజ్జల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ రంగ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. డిస్కమ్ల నుంచి ఎదురవుతున్న 19 సమస్యలను మంత్రి ముందు జేఏసీ పెట్టింది. డిస్కమ్లు పాత సర్వీస్ రూల్స్నే కొనసాగించాలన్నారు. రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చే విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని జేఏసీ డిమాండ్ చేసింది.
పాత సర్వీస్ రూల్స్నే కొనసాగించాలి: విద్యుత్ ఉద్యోగుల జేఏసీ
RELATED ARTICLES