మూడు సంవత్సరాల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఎపి కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ జెఎసి ఛైర్మెన్ ఎ.వి. నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
ఆదివారం తెనాలిలో జరిగిన KW ఇరిగేషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రధమ మహాసభకు ముఖ్య అతిధిగా జెఎసి ఛైర్మెన్ ఎ.వి నాగేశ్వరరావు, ఎపిపిడ్ల్యుడి, ఆర్ & బి , పంచాయితీ రాజ్ ఎంప్లాయిస్ ఆసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా జెఎసి ఛైర్మెన్ వై. నేతాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎ.వి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా పని చేయించుకుంటూ వేతనాలు చెల్లించకపోవడం, ఆరు నెలలకే ఉత్తర్వులు ఇచ్చి తొమ్మిది నెలలు పాటు పని చేయించుకోవడం దుర్మార్గం అని అన్నారు.
యేడాదిలో 12 నెలలు వేతనాలు చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, శెలవు సౌకర్యరాలు కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆయన మహాసభలలో డిమాండ్ చేశారు. అనతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.