నిరాసలో ప్రభుత్వ ఉద్యోగులు.
సజ్జల హామీ నీటి మూటలేన
ఎంప్లాయిస్ వాయిస్ః ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పిఆర్సి నివేదికపై ఏలాంటి చర్చ జరగలేదు. వెలగపూడి సచివాలయం లో గురువారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశమైంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం జరుగుతున్న నేపథ్యంలో పిఆర్సి నివేదికపై మంత్రిమండలి చర్చిస్తుందా అన్న ప్రశ్న ఉద్యోగుల్లో ఉండేది. అయితే సమావేశం అజెండాలో పీఆర్సీ ప్రస్తావన రాలేదని మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. మంత్రిమండలి నిర్ణయాలు ఆయన విలేకరులకు వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకరులు పీఆర్సీ అమలుపై ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి మధ్య ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి అని ఆయన చెప్పారు. ఆ చర్చ తర్వాత పిఆర్సి అంశం కొలిక్కి వస్తుందని మంత్రి పేర్ని నాని అభిప్రాయపడ్డారు.