ఏపీ ప్రభుత్వ జీవోలు ఆన్లైన్లో ఉంచకుండా గెజిట్లో ఇవ్వటంపై హైకోర్టులో విచారణ జరిగింది. సాఫీగా జరిగే ప్రక్రియను ఎందుకు తొలగించారని హైకోర్టు ప్రశ్నించింది. నూతన విధానాన్ని ఎందుకు ప్రవేశ పెట్టాల్సి వచ్చిందంటూ చురకలు వేసింది. కాన్ఫిడెన్షియల్ పేరిట ఉన్న జీవోలను ఎలా నిర్ధారిస్తారని ప్రభుత్వ న్యాయవాదిని ఏపీ హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. సంతకం లేని జీవోలను హైకోర్టు, సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవడంతో ఆన్లైన్లో జీవోలను పెట్టటం నిలిపి వేశారని ధర్మాసనం దృష్టికి న్యాయవాది తెచ్చారు. దీనిపై సమాచారం ఇచ్చేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. సెలవుల అనంతరం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.
ఏపీ ప్రభుత్వ జీవోలు ఆన్లైన్లో ఉంచకుండా గెజిట్లో ఇవ్వటంపై హైకోర్టులో విచారణ.
RELATED ARTICLES