ఎంప్లాయిస్ వాయిస్:నెల్లూరు జిల్లా ఆత్మకూరు ,వింజమూరు ,రాచర్లపాడు సబ్ స్టేషన్ లలో అక్రమంగా తొలగించిన 26 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చోక్ వద్ద యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆద్వర్యం లో రెండవ రోజు ధర్నా జరిగింది. ఈరోజు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.అజయ్ కుమార్ ధర్నా ప్రారంభించి మద్దతు తెలిపారు.
యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశి మాట్లాడుతూ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా తొలగించడం దారుణమని ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అంగన్వాడీ & హెల్పేర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మా గారు రైల్వే కాంట్రక్టు వర్కర్స్ యూనియన్ నరసింహులు ప్రభుత్వ రంగ సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూర్ మొహమ్మద్ మరియు హెచ్.180 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా నాగరాజు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు.